: ఈ రోజు తన పాటను పది సార్లు చూపించింది... నిద్రరాక ఏమవుతుంది?: పరిణీతిపై అజయ్ దేవగణ్ చమక్కు

'మేరీ ప్యారీ బిందు' సినిమాలో పరిణీతి పాట పాడడం పట్ల బాలీవుడ్ నటులంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. పరిణీతి అద్భుతంగా పాడిందని అభినందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు అజయ్ దేవగణ్ మాత్రం ట్విట్టర్ లో పరిణీతి టార్చర్ ను వివరించాడు. గోల్ మాల్ 4 సెట్ లో పరిణీతి చోప్రా అందరూ తన పాటను ప్రశంసిస్తున్నారంటూ అజయ్ దేవగణ్ తో పాటు ఈ సినిమాలో నటించే యూనిట్ కు తన పాటను మొబైల్ లో చూపించిందట.

ఈ సందర్భంగా యూనిట్ మొత్తం నిద్రలోకి జారుకున్న ఫోటోను అజయ్ దేవగణ్ తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేస్తూ... ఈ రోజు ఇది పదో సారి... నా పాట బాగుందా? అంటూ చూపించింది. నిద్ర రాక ఏమవుతుంది? అందరం గుర్రుపెట్టి నిద్రపోయాం.. అయినప్పటికీ ఆమె అద్భుతంగా పాడింది... ఇంత ప్రతిభ వున్నప్పుడు ప్రశంసించకుండా ఉండలేమని అంటూ పోస్టు చేశాడు. 

More Telugu News