: బీజేఎల్పీ ఆఫీసు గది జగన్ బాత్రూమ్ అంత కూడా లేదు: ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు

ఏపీ అసెంబ్లీని నిర్మించిన తీరుపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విమర్శల వర్షం కురిపించారు. స్కూల్స్, కాలేజీలు నిర్మించినట్టుగా అమరావతిలో అసెంబ్లీ భవనాన్ని నిర్మించారని అన్నారు. బీజేఎల్పీ ఆఫీసును అష్టవంకర్లతో నిర్మించారని, ఆ గదిని చూస్తే తనది చేతగాని తనమనే భావన ఢిల్లీ పెద్దలకు కలిగేలా ఉందని విమర్శించారు. ఢిల్లీ నుంచి బీజేపీ నేతలు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే ఈ గదికి తీసుకురావాలన్నా ఇబ్బందేనని అన్నారు. బీజేఎల్పీ గదిలో బాత్రూమ్ లేదేమిటని మంత్రులను ప్రశ్నిస్తే, ‘మాదీ అదే పరిస్థితి’ అని అంటున్నారని, ప్రతిపక్ష నేత జగన్ బాత్రూమ్ అంత కూడా తమ ఆఫీసు గది లేదంటూ విష్ణుకుమార్ రాజు పేర్కొనడం గమనార్హం. 

More Telugu News