: భారత జాతీయ జెండాను అవమానించిన చైనా ఫోన్‌ కంపెనీ ఉద్యోగి.. కార్యాలయం ముందు నిరసనలు!

చైనా స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ ఒప్పోకు చెందిన ఓ ఉద్యోగి అహంకారం ప్ర‌ద‌ర్శించ‌డంతో నోయిడాలోని ఆ కంపెనీ ముందు ఆందోళ‌న చెల‌రేగింది. ఆ కంపెనీ ఉద్యోగి అయిన‌ ఒకరు భారత జాతీయ‌ జెండాను చింపి, చెత్తకుప్పలో వేసినట్టు ప‌లువురు చెబుతున్నారు. ఈ స‌మాచారం తెలుసుకున్న కొంద‌రు జాతీయ జెండాలను పట్టుకొని ఒప్పో ఇండియా కార్యాలయం ముందు ఈ రోజు ఆందోళ‌న‌కు దిగారు. ఆ కంపెనీ భారత జెండాను అవమానించిందని, అహంకారం ప్ర‌ద‌ర్శించింద‌ని వారు మండిప‌డుతున్నారు. ఈ విష‌య‌మై సోష‌ల్ మీడియాలో విపరీతంగా పోస్టులు వ‌స్తున్నాయి. ఈ విష‌యంపై ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్పందించాల‌ని నెటిజ‌న్లు కోరుతున్నారు. ఒప్పో కంపెనీపై చర్యలు తీసుకోవాల్సిందేన‌ని డిమాండ్‌ చేస్తున్నారు.






More Telugu News