: ఆసీస్ పై కేఎల్ రాహుల్ రికార్డిదే!

ఆస్ట్రేలియా జట్టుపై టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. భారత్ లో నిర్వహించిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన నాలుగు టెస్టుల్లోని ఎనిమిది ఇన్నింగ్స్ లలో ఏడు ఇన్నింగ్స్ లు ఆడిన రాహుల్... మొత్తం ఆరు సార్లు అర్ధ సెంచరీలు సాధించాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టుపై ఒక సిరీస్ లో అత్యధిక అర్ధ సెంచరీలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. నాలుగు టెస్టుల్లో రాహుల్ వరుసగా 64, 10, 90, 51, 67, 60, 51 పరుగులు సాధించి సత్తాచాటాడు.

అతని తరువాతి స్థానంలో మరో ఓపెనర్ మురళీ విజయ్ నిలిచాడు. మురళీ విజయ్ 2015-16 సీజన్ లో ఆస్ట్రేలియాపై వరుసగా ఐదు అర్ధ సెంచరీలు సాధించాడు. చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో అర్ధసెంచరీ సాధించడం ద్వారా మురళీ విజయ్ రికార్డును సమం చేసిన రాహుల్, రెండో ఇన్నింగ్స్ లో చివరి బంతికి రెండు పరుగులు చేయడం ద్వారా అర్ధ సెంచరీ సాధించి కొత్త రికార్డు నెలకొల్పాడు. 

More Telugu News