: సభ నుంచి వెళ్లిపోయిన జగన్.. వెనుకే రోజా కూడా.. టీడీపీ ఎద్దేవా

ఏపీ అసెంబ్లీలో వైసీపీ సభ్యుల నిరసనల మధ్యే పలు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. ఈ బిల్లులన్నింటినీ స్పీకర్ ఆమోదిస్తున్నారు. ఈ నేపథ్యంలో, వైసీపీ అధినేత జగన్, ఎమ్మెల్యే రోజా సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో, జగన్ పై టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. హైదరాబాదుకు వెళ్లడానికి జగన్ కు సాయంత్రం 4.30 గంటలకు ఫ్లైట్ ఉందని... అందుకే ఆయన అసెంబ్లీ సమావేశాలను సైతం పక్కన పెట్టి, వెళ్లిపోతున్నారని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలకు రావడానికి కూడా ఆయన ఉదయం హైదరాబాద్ నుంచి 8.40కి ఫ్లైట్ లో బయల్దేరి 10.30కి ఇక్కడకు చేరుకుంటారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు హైదరాబాద్ వెళ్లడానికి ఆయనకు ఫ్లైట్ టైమ్ అవుతోందని... అందుకే ప్రశాంతంగా సభ నుంచి నిష్క్రమించారని అన్నారు.   

More Telugu News