: ఇంట్లో కూర్చుని రాయడం తేలికే...మైదానంలో దిగి ఆడితే తెలుస్తుంది: ఆసీస్ మీడియాపై కోహ్లీ ఆగ్రహం

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సిరీస్ ముగిసిన తరువాత ఆసీస్ మీడియా కథనాలపై స్పందించాడు. టెస్టు సిరీస్ లో విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. కొంత మంది ఇంట్లో కూర్చుని కథనాలు వండి వారుస్తుంటారని కోహ్లీ మండిపడ్డాడు. అలాంటి వారికి మైదానంలో దిగి ఆడితే పరిస్థితి ఏంటి? అన్నది తెలుస్తుందని కోహ్లీ సూచించాడు. ఫీల్డ్ లో పరిస్థితులు వారు ఇంట్లో కూర్చుని రాసినట్టు ఉండవని కోహ్లీ ఘాటుగా విమర్శించాడు. ఎవరైనా తమను విమర్శిస్తే...వారికి సరైన సమాధానం చెబుతామని కోహ్లీ అన్నాడు. మాటైనా, ఆటైనా ఘాటుగా జవాబిచ్చేందుకు సదా సిద్ధమని అన్నాడు. 

More Telugu News