: రాయలసీమలో రెండో రాజధానిని నిర్మించండి: వైసీపీ

కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి మొత్తాన్ని ఒకే ప్రాంతంలోనే కేంద్రీకరిస్తే... రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను సమానంగా చేయాలని తెలిపారు. రాయలసీమలో రెండో రాజధానిని నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలని చెప్పారు. రాయలసీమకు అన్యాయం చేస్తే, రాబోయే రోజుల్లో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ప్రతి విషయంలోనూ తమ ప్రాంతానికి అన్యాయం జరుగుతోందనే ఆవేదన ఇప్పటికే రాయలసీమ ప్రజల్లో నెలకొందని చెప్పారు. 

More Telugu News