: వైసీపీ నేతల నిరసనల మధ్యే పలు బిల్లులకు ఆమోదం

ఏపీ అసెంబ్లీ అట్టుడుకుతోంది. పదవ తరగతి ప్రశ్నాపత్రం లీక్ కావడంపై చర్చ కోసం వైసీపీ సభ్యులు పట్టుబడుతున్నారు. పోడియంలోకి చొచ్చుకొచ్చి, నినాదాలు చేస్తున్నారు. ఇదే సమయంలో, వైసీపీ ఎమ్మెల్యేల నిరసనల మధ్యే పలు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. ఈ నేపథ్యంలో, ద్రవ్య వినిమయ బిల్లును సభ ఆమోదించింది. దీంతోపాటు, పలు బిల్లులను సభ ఆమోదిస్తోంది. 

More Telugu News