: జమ్మూకాశ్మీర్ లో జవాన్లపై రాళ్ల దాడి.. కాల్పుల్లో ఒకరి మృతి!

జమ్మూకాశ్మీర్ లోని ఛాదూరా ప్రాంతంలో మిలిటెంట్లు ఉన్నారనే సమాచారం మేరకు భద్రతా సిబ్బంది ఈ రోజు ఉదయం గాలింపు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జవాన్లపై స్థానికులు కొందరు రాళ్ల దాడికి పాల్పడ్డారు. మిలిటెంట్లకు, భద్రతా సిబ్బందికి మధ్య ఎన్ కౌంటర్ జరుగుతున్న సమయంలో అధిక సంఖ్యలో అక్కడ గుమిగూడి ఉన్న స్థానికులు, భద్రతా సిబ్బంది పైకి రాళ్లు రువ్వుతూ ఆందోళన చేపట్టారు. దీంతో, వారిని అదుపు చేసేందుకు భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించగా నలుగురు గాయపడినట్లు పోలీసులు పేర్కొన్నారు. 

More Telugu News