: ఐపీఏల్ హంగామా... ముంబై ఇండియన్స్ ప్రాక్టీస్ షురూ!

ఏప్రిల్ 6 న జరగనున్న మ్యాచ్ కోసం ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టేశారు. ఏప్రిల్ 5న ఐపీఏల్ ప్రారంభ వేడుకలు జరగనుండగా, ఆ రోజునే మ్యాచ్ లు మొదలవుతాయి. తొలి మ్యాచ్ ను ఏప్రిల్ 5న సన్ రైజర్స్ హైదరాబాదు జట్టుతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆడనుంది. ఏప్రిల్ 6న ముంబై ఇండియన్స్ తో పూణే సూపర్ జెయింట్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు ప్రాక్టీస్ లో పడిపోయారు. ప్రాక్టీస్ సెషన్ కు జట్టు యజమాని నీతా అంబానీ కూడా హాజరయ్యారు. దీంతో ఆటగాళ్లు మరింత ఉత్సాహంగా ప్రాక్టీస్ కొనసాగించారు. జట్టు కోచ్ లతో నీతా అంబానీ మాట్లాడి జట్టు కూర్పుపై చర్చించి వెళ్లారు. 

More Telugu News