: చెవిరెడ్డిని విడిచి పెట్టిన పోలీసులు!

ఈ రోజు ఉద‌యం ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ గేటు బయట దీక్షకు దిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్‌ స్టేషన్‌కు తరలించిన విష‌యం తెలిసిందే. అయితే, కొద్దిసే‌ప‌టి క్రితం ఆయ‌న‌ను పోలీసులు విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడిపై మండిప‌డ్డారు. ఆయ‌న పాల‌న‌ను తాలిబ‌న్ల పాల‌న‌తో పోల్చారు. తన  దీక్షను కొనసాగిస్తానని తేల్చిచెప్పారు. అధికారుల‌తో వాద‌న‌కు దిగిన‌ టీడీపీ నేతలు కేశినేని నాని, బొండా ఉమాలపై చ‌ర్య‌లు తీసుకోవాలని ఆయ‌న అన్నారు.

More Telugu News