: భార్యకు గుడి కట్టి.. నిలువెత్తు విగ్రహానికి నిత్య పూజలు చేస్తున్న పోలీసు అధికారి!

భార్య ఉండగానే మరో పెళ్లి చేసుకున్న ఘనులే కాదు, భార్య తనువు చాలించిన కొన్ని రోజులకే రెండో పెళ్లికి ‘మేము రెడీ’ అంటున్నవారూ లేకపోలేదు. అయితే, చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల కొండపై డీఎస్సీగా విధులు నిర్వహిస్తున్న ముని రామయ్య మాత్రం ఇందుకు భిన్నం. ముని రామయ్య భార్య ఇటీవల మృతి చెందిన సంఘటన ఆయనకు తీరని ఆవేదన మిగిల్చింది. ఆ బాధను దిగమింగుకునేందుకు ముని రామయ్య తన స్వగ్రామంలో ఓ గుడి కట్టి, అందులో తన భార్య నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

ఈ విగ్రహానికి నిత్య పూజలు చేస్తున్న ముని రామయ్య, ఈ విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచారు. అయితే, ఇటీవలే ఈ విషయం బయటపడింది. ఇటువంటి వ్యక్తిని తామెప్పుడూ చూడలేదంటూ ముని రామయ్యపై గ్రామస్తులు, పోలీసులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ విషయమై ఎందుకు గోప్యంగా వ్యవహరించారనే ప్రశ్నకు ముని రామయ్య స్పందిస్తూ.. ప్రచారం కోసం ఈ గుడి కట్టలేదని, తమ అనుబంధానికి గుర్తుగా మాత్రమే దీనిని కట్టానని చెప్పారు. 

More Telugu News