: మా వాళ్లు చేసిన దాడి చాలా చిన్న విషయం: చీఫ్ విప్ కాల్వ

రవాణాశాఖ అధికారులపై టీడీపీ నేతలు కేశినేని నాని, బొండా ఉమామహేశ్వరరావులు చేసిన దాడి చాలా చిన్న విషయమని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి చిన్న విషయాన్ని వైసీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. తమ వాళ్లు ఆల్రెడీ సారీ చెప్పేశారని... దీంతో, ఈ వివాదం ముగిసిపోయిన అంశమని చెప్పారు.  

అంతకు ముందు వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, అధికారులపై టీడీపీ నేతలు కక్ష సాధింపు ధోరణిని అవలంబిస్తున్నారని ఆరోపించారు. అధికారులపై దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయని అన్నారు. టీడీపీ నేతలు రౌడీయిజం చేస్తున్నారంటూ మండిపడ్డారు.

More Telugu News