: పుట్టుమచ్చలు చెరిపేశారన్న డాక్టర్ల నివేదిక నేపథ్యంలో, నేడు తేలనున్న ధనుష్ భవితవ్యం!

తమిళ నటుడు, రజనీకాంత్ అల్లుడు తమ కుమారుడేనంటూ కదిరేశన్, మీనాక్షి దంపతులు వేసిన కేసుపై మధురై కోర్టు నేడు కీలక రూలింగ్ ను ఇవ్వనుంది. ఇప్పటికే ధనుష్ తమ కుమారుడేనని చూపే ఆధారాలను కదిరేశన్ కోర్టుకు అందించిన సంగతి తెలిసిందే. మరోవైపు ధనుష్ తన కుమారుడేనని దర్శకుడు కస్తూరి రాజా వాదిస్తున్నారు. ఈ కేసులో కీలకమైన పుట్టు మచ్చలను ధనుష్ అత్యాధునిక లేజర్ చికిత్స ద్వారా చెరిపేశారని వైద్యులు ఇచ్చిన నివేదిక, ఆయనకు పెను సమస్యగా మారవచ్చని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఇక చివరిగా ధనుష్ ఎవరి కుమారుడో తేల్చేందుకు డీఎన్ఏ పరీక్షలకు నేడు ఆదేశించవచ్చని తెలుస్తోంది. కోర్టు తీర్పుపై కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ సినీ పరిశ్రమ సైతం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది.

More Telugu News