: పుల్వామాలో ఎన్ కౌంటర్.... ఇద్దరు తీవ్రవాదుల హతం

జమ్మూకశ్మీర్‌ లోని పుల్వామా జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు తారసపడటంతో బలగాలు కాల్పులు జరిపి వారిని అంతమొందించాయి. ఘటనాస్థలి నుంచి ఒక ఎస్‌ఎల్‌ఆర్, ఒక ఏకే 47ను స్వాధీనం చేసుకున్నారు. 

More Telugu News