: దారుణం... పదమూడేళ్ల బాలికపై 8 మంది టీచర్ల అఘాయిత్యం!

సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే అంత్యంత దారుణమైన ఘటన రాజస్థాన్ లోని బికనీర్ లో చోటుచేసుకుంది. 2015 లో ఓ ప్రైవేట్ స్కూల్ లో చదువుతున్న 13 ఏళ్ల బాలికపై 8 మంది టీచర్లు 18 నెలలపాటు గ్యాంగ్ రేప్ కు పాల్పడిన ఘటన కలకలం రేపింది. దీనిపై మహిళా కమిటీతో ప్రభుత్వం విచారణ జరిపిస్తోంది. అయితే అప్పుడు చేసిన ఆ ఘనకార్యానికి సంబంధించిన వీడియోలు తీసిన ఆ దుండగులు ఇప్పుడామెను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని బాధిత బాలిక తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. కేన్సర్ తరహా వ్యాధితో బాధపడుతున్న తన కుమార్తెపై అఘాయిత్యం చేయడమే కాకుండా, ఆమె గర్భందాల్చకుండా మాత్రలు కూడా ఇచ్చారని ఆయన కుమిలిపోయారు.  

More Telugu News