: గిల్గిట్-బాల్టిస్థాన్ ఇండియాది.. పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించుకుంది: బ్రిటన్ పార్లమెంట్

గిల్గిట్-బాల్టిస్థాన్ ను ఐదో రాష్ట్రంగా పాకిస్థాన్ ప్రకటించడాన్ని బ్రిటన్ పార్లమెంటు తప్పబట్టింది. చట్టబద్ధంగా ఈ భూభాగం భారతదేశంలోని జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోనిదని తేల్చి చెప్పింది. 1947లో చట్ట విరుద్ధంగా, అక్రమంగా ఈ భూభాగాన్ని పాకిస్థాన్ ఆక్రమించుకుందని తెలిపింది. ఈ అంశానికి సంబంధించిన తీర్మానాన్ని పార్లమెంటులో ఈ నెల 23న కన్సర్వేటివ్ నేత బాబ్ బ్లాక్ మన్ ప్రతిపాదించారు.

వివాదాస్పదమైన ప్రాంతాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకునే విధంగా పాక్ ప్రకటన ఉందని ఈ తీర్మానంలో పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల ప్రాథమిక హక్కులు తిరస్కరణకు గురవుతున్నాయని తెలిపింది. కనీసం వాక్ స్వాతంత్ర్యం కూడా అక్కడి పౌరులకు లేదని చెప్పింది. ఇదే సమయంలో చైనా పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ)ను కూడా తప్పుబట్టింది. ఈ కారిడార్ నిర్మాణం చాలా తీవ్రమైన విషయమని... వివాదాస్పద ప్రాంతంలో జోక్యం చేసుకోవడమేనని తెలిపింది.

More Telugu News