: నిర్మాత సంజయ్ నన్ను లైంగికంగా వేధించాడు: నటి శిల్పాషిండే

దాసరి నారాయణరావు సినిమా 'చిన్నా', సురేష్ వర్మ చిత్రం 'శివాని'లలో నటించిన ముంబై భామ శిల్పా షిండే లైంగిక వేధింపులకు గురైంది. 'బాబాజీ ఘర్ పర్ హై' టీవీ షోతో బాగా పాప్యులర్ అయిన శిల్పా... ఆ షో నిర్మాత సంజయ్ కోహ్లీపై ముంబైకి సమీపంలోని వాల్వీ నైగావ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. సంజయ్ తనతో తరచుగా అసభ్యంగా ప్రవర్తించే వాడని, తనను ఒక్కసారి అసభ్యంగా తాకాడని, లైంగికంగా వేధించాడని ఫిర్యాదులో ఆమె పేర్కొంది.

దీనికి తాను నిరాకరించగా, ఈ విషయం బయటకు చెబితే షో నుంచి తీసేస్తానని బెదిరించాడని చెప్పింది. ఆ తర్వాతి రోజు మేకప్ రూమ్ లోకి వచ్చి, శారీరక సంబంధం పెట్టుకోవాలని చెప్పాడని, ఈ మాటలను మేకప్ మ్యాన్ వినడంతో అతన్ని విధుల నుంచి తొలగించాడని ఆరోపించింది. దీంతో, ఆ షో నుంచి తాను తప్పుకున్నానని... ఈ నేపథ్యంలో, తనకు ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపింది. ఈ క్రమంలో, సంజయ్ కోహ్లీపై ఎఫ్ఐఆర్ నమోదయింది. మరోవైపు, తన పరువుకు నష్టం వాటిల్లేలా శిల్పా ప్రవర్తించిందంటూ ఆమెపై రూ. 12.5 కోట్ల పరువు నష్టం దావాను కోహ్లీ వేశాడు. శిల్పా కేసు బూటకమని, తనపై ఆమె తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆయన అన్నారు.

More Telugu News