: కొత్త నియోజకవర్గాల ఏర్పాటుపై దృష్టి సారించిన కేసీఆర్

తెలంగాణలోని జిల్లాల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్... ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజనపై దృష్టి సారించారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజకు కేంద్రం నుంచి సానుకూల సంకేతాలు వెలువడ్డాయి. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడతామని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఈ విషయంపై చర్చించడానికి టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ ఈ సాయంత్రం భేటీ కానున్నారు. 

More Telugu News