: రిలాక్స్ పేరిట సినిమాకు వెళ్లిన వివాదాస్పద ఎంపీ రవీంద్ర గైక్వాడ్
తనకు విమానంలో బిజినెస్ క్లాస్ సీటు ఇవ్వలేదన్న ఆగ్రహంతో ఎయిర్ ఇండియా ఉద్యోగిని చెప్పుతో కొట్టి తీవ్ర వివాదంలో కూరుకుపోయిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్, తనకు కాసేపు రిలాక్స్ కావాలని చెబుతూ సినిమాకు వెళ్లిపోయారు. నేడు మీడియాతో మాట్లాడుతూ, తాను ఎయిర్ ఇండియా ఉద్యోగికి క్షమాపణలు చెప్పేది లేదని స్పష్టం చేసిన ఆయన, మనసును ఆహ్లాదంగా ఉంచుకునేందుకు తాజా చిత్రం 'బద్రీనాథ్ కీ దుల్హనియా' చూశానని, ఈ సినిమాను అందరూ చూడాలని చెప్పారు. ఇక ఆయన్ను ఎయిర్ ఇండియా బ్లాక్ లిస్టులో పెట్టిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, తన వద్ద టికెట్లు ఉన్నాయని, నేటి సాయంత్రం ఢిల్లీ నుంచి పుణెకు వెళ్లనున్నానని, ఎలా తనను విమానం ఎక్కించుకోరో చూస్తానని అన్నారు.