: కేసుల నుంచి తప్పించేందుకు బీజేపీతో గాలి జనార్దన్ రెడ్డి రూ. 500 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నారు: కుమారస్వామి గౌడ ఆరోపణ

అక్రమ గనుల కేసులో ప్రధాన నిందితుడైన గాలి జనార్దన్ రెడ్డిని కేసుల నుంచి రక్షించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి గౌడ తీవ్ర ఆరోపణలు చేశారు. జేడీఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీపైన, గాలిపైన విరుచుకుపడ్డారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు బీజేపీతో గాలి ఒప్పందం కుదుర్చుకున్నారని అన్నారు. కేసు నుంచి తనను తప్పిస్తే... దానికి ప్రతిఫలంగా రూ. 500 కోట్ల విలువైన తన ఆస్తులను అమ్మి, బీజేపీకి పార్టీ ఫండ్ గా ఇచ్చేందుకు గాలి అంగీకరించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు బీజేపీ అధికార ప్రతినిధి సురేష్ కుమార్ మాట్లాడుతూ, కుమారస్వామి చేసిన ఆరోపణలు నిరాధారమైనవని అన్నారు. 

More Telugu News