: శ్రీశైలంలో కన్నడిగుల వీరంగం... పోలీసుల లాఠీచార్జ్

రోడ్డుకు అడ్డంగా నిలిపిన ఓ బస్సును తొలగించే క్రమంలో శ్రీశైలంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కర్ణాటక నుంచి బస్సులో వచ్చిన కొందరు భక్తులు, నంది జంక్షన్ లో రోడ్డుకు అడ్డంగా బస్సును నిలిపారు. బస్సును అక్కడి నుంచి తీయాలని పోలీసులు కోరడంతో వాదన మొదలైంది. బస్సును బలవంతంగా తరలించేందుకు పోలీసులు యత్నించడంతో కన్నడిగులు వీరంగం సృష్టించారు. పోలీసులపై దాడికి దిగారు. వారిని నిలువరించేందుకు పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. కన్నడ భక్తులను చెదరగొట్టిన పోలీసులు, కొందరిని అరెస్ట్ చేసినట్టు సమాచారం.

More Telugu News