: గొంతులు కోసి అత్యంత పాశవికంగా తెలుగువారి హత్య!

గత రాత్రి అమెరికాలోని బర్లింగ్టన్ లో హత్యకు గురైన తెలుగువారిని అత్యంత కిరాతకంగా దుండగులు హతమార్చారు. ఫెడరల్ పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ప్రకాశం జిల్లాకు చెందిన నర్రా హనుమంతరావు, ఆయన భార్య శశికళ (40) సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వీరికి 12 సంవత్సరాల క్రితం వివాహం కాగా, కుమారుడు హనీష్ సాయి (7) ఉన్నాడు. హనుమంతరావు ఆఫీసు నుంచి వచ్చేసరికి ఆయన భార్య, కుమారులను గొంతులు కోసి పాశవికంగా హత్య చేశారు.

ఈ ప్రాంతంలో హనుమంతరావుకు ఎవరూ శత్రువులు లేరని, ఆయన అందరితో కలుపుగోలుగా ఉంటారని, ఆయన భార్య చాలా మంచి వ్యక్తని ఇరుగు పొరుగు వారు తెలిపారు. ఇంట్లోని తల్లీ కొడుకులను ఇంత దారుణంగా చంపాల్సిన అవసరం ఎవరికి ఉందో తెలియడం లేదని అన్నారు. ఇది జాతి వివక్ష కారణంగా జరిగిన హత్యలని అనుమానిస్తున్నట్టు తెలిపారు.

More Telugu News