: దర్శకుడు దాసరి ఆసుపత్రి బిల్లు ఒక రేంజ్ లో ఉందట!

ఇటీవల అనారోగ్యానికి గురైన ప్రముఖ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు సుమారు నెల రోజుల నుంచి కిమ్స్ ఆసుపత్రిలోనే ఉన్నారు. ఈ నెల 30న ఆయన డిశ్చార్జి కానున్నట్టు సమాచారం. అయితే, ఆసుపత్రి బిల్లు తడిసి మోపెడు అయినట్టు తెలుస్తోంది. ఎందుకంటే, కిమ్స్ ఆసుపత్రిలోని వీఐసీ ప్రత్యేక గదుల్లో ఉంచే దాసరికి చికిత్స అందించారు. వీఐపీ గదికి ఒక్కో రోజు అద్దె రూ.40 వేలు. దాసరి కుటుంబ సభ్యులు బస చేసేందుకు రెండు వీఐపీ సూట్లు, దాసరిని పరామర్శించేందుకు వచ్చే వారి కోసం మరికొన్ని సూట్లు తీసుకున్నారు. పరామర్శించేందుకు వచ్చిన వారికి టీ లు, టిఫిన్లు, భోజనం.. ఇలా అన్నీ కలుపుకుని బిల్లు మొత్తం రూ.90 లక్షల వరకు చేరిందట. ఇప్పటికే, ఆసుపత్రి బిల్లు తడిసి మోపెడు కావడంతో, వీఐపీ సూట్ నుంచి సాధారణ గదికి దాసరి వచ్చేసినట్టు తెలుస్తోంది. అయితే, ఈ బిల్లును దాసరి చెల్లిస్తారా? లేక కేంద్ర మాజీ మంత్రి కనుక ప్రభుత్వం చెల్లిస్తుందా? అనే విషయమై స్పష్టత రావలసి వుంది.

More Telugu News