: తెలంగాణలో 15 మంది ఐపీఎస్ ల బదిలీలు!

తెలంగాణ రాష్ట్రంలో 15 మంది ఐపీఎస్ లకు స్థాన చలనం జరిగింది. హైదరాబాద్ రేంజ్ డీఐజీగా స్టీఫెన్ రవీంద్ర, ఏసీబీ డీజీపీగా జె.పూర్ణచందర్ రావు, ఏడీజీపీగా గోవింద్ సింగ్, టీఎస్ పీఏ డైరెక్టర్ గా జితేందర్, ఐజీపీగా(వెల్ఫేర్) సౌమ్యా మిశ్రా, విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ గా శశిధర్ రెడ్డి, కరీంనగర్ రేంజ్ డీఐజీగా సి.రవివర్మ, నిజామాబాద్ డీఐజీగా శివశంకర్ రెడ్డి, రాచకొండ జాయింట్ సీపీగా తరుణ్ జోషి, ఎక్సైజ్ డీజీగా అకున్ సబర్వాల్, సైబరాబాద్ జాయింట్ సీపీగా షాన్వాజ్ ఖాసిం, ఖమ్మం కమిషనర్ గా ఇక్బాల్, ఏసీబీ డైరెక్టర్ గా ఎ.సత్యనారాయణ, టీఎస్ పీఏ డిప్యూటీ డైరెక్టర్ గా బి.నవీన్ కుమార్, ట్రాఫిక్ జాయింట్ సీపీగా రవీందర్ ను బదిలీ చేశారు.

More Telugu News