: నా ప్రతిష్ఠ కూడా నాకు ముఖ్యమే: స్పీకర్ కోడెల
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గందరగోళం చెలరేగుతోంది. ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు పలు ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. సభను వాయిదా వేసే ముందు ఈ అంశంపై స్పీకర్ మాట్లాడుతూ మంత్రిపై ఆరోపణల విషయంలో సమస్యలను జటిలం చేయొద్దని జగన్కు సూచించారు. తనపై చేసిన ఆరోపణల అంశంలో మంత్రి చేసిన సవాల్కు స్పందించాలని స్పీకర్ అన్నారు. సవాల్ను స్వీకరిస్తున్నారో లేదో స్పష్టం చేయాలని కోరారు. వాస్తవాలు ఐదు కోట్ల మందికి, చట్టసభలకు తెలియాల్సి ఉందని వ్యాఖ్యానించారు. అలాగే ఇటీవల తాను పాల్గొన్న మీట్ ది ప్రెస్లో తాను చెప్పిన వ్యాఖ్యలను వక్రీకరించారని స్పీకర్ కోడెల అన్నారు. నా ప్రతిష్ఠ కూడా నాకు ముఖ్యమే కదా? అని వ్యాఖ్యానించారు.