: వరుసగా మూడో రోజు బేర్ మన్న మార్కెట్లు

భారతీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా సరైన మద్దతు లభించకపోవడం, అమ్మకాల ఒత్తిడితో మార్కెట్లు ఈ రోజు భారీగా పతనమయ్యాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి, సెన్సెక్స్ ఏకంగా 318 పాయింట్లు నష్టపోయి 29,168కి పడిపోయింది. నిఫ్టీ 91 పాయింట్లు కోల్పోయి 9,030కు చేరింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్...
ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ (6.94%), శోభ లిమిటెడ్ (6.94%), డెల్టా కార్ప్ (4.64%), ఒబెరాయ్ రియాల్టీ (3.65%), గుజరాత్ మినరల్స్ డెవలప్ మెంట్ (3.18%).

టాప్ లూజర్స్...
జస్ట్ డయల్ (-5.26%), కోరమాండల్ ఇంటర్నేషనల్ (-4.67%), గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ లిమిటెడ్ (-4.49%), ర్యాలీస్ ఇండియా (-4.18%), ఇండియా సిమెంట్స్ (-3.98%).  

More Telugu News