: రెడ్ లైన్ దాటితే సస్పెండ్ చేయండి.. వాళ్లు వేస్ట్ చేస్తున్న సమయానికి డబ్బులు వసూలు చేయండి: స్పీకర్ కు సూచించిన యనమల

శాసనసభ సమావేశాలను అడ్డుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేలపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యకలాపాలను అడ్డుకుంటున్న విపక్ష సభ్యులను అదుపు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. స్పీకర్ పోడియం చుట్టూ రెడ్ లైన్ ను ఏర్పాటు చేయాలని... ఆ లైన్ ను దాటి ఎవరు లోపలకు వస్తే, వారిని సస్పెండ్ చేయాలని సూచించారు. దీనికి తోడు, పార్లమెంటులో ఉన్న ఆటోమేటిక్ సస్పెన్షన్ చట్టాన్ని ఇక్కడ కూడా అమలు చేయాలని చెప్పారు. వైసీపీ సభ్యులు పదేపదే సభను అడ్డుకుంటుంటే... వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. తాము మాట్లాడకుండా అత్యంత విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారని... వారు వేస్ట్ చేస్తున్న సమయానికి అయ్యే ఖర్చును వారి నుంచి వసూలు చేయాలని డిమాండ్ చేశారు. 

More Telugu News