: ఫిట్ నెస్ విషయంలో రాజీ పడొద్దంటున్న మహేష్ బాబు భార్య నమ్రత

ఫిట్ నెస్ విషయంలో రాజీ పడొద్దని ప్రముఖ సినీ నటి, టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ తెలిపారు.   కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ఉద్యోగాలు చేసే తల్లులకు వచ్చే సందేహాలను నివృత్తి చేసేందుకు హైదరాబాదు, బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్ లో 'ఆల్మండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోర్నియా' ఏర్పాటు చేసిన చర్చావేదికలో నమ్రత మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి రోజు ఓ గుప్పెడు బాదం పప్పులను తినడంతో పాటు రోజూ ఫిట్‌నెస్‌ కార్యక్రమాలను తాను అనుసరిస్తుంటాననని అన్నారు. ప్రతి తల్లీ తన కుటుంబం కోసం ఆరోగ్యకరమైన సమతౌల్య జీవితాన్ని ఆచరించాలని ఆమె ఆకాంక్షించారు. కుటుంబంతో పాటు సొంత ఆరోగ్యంపై కూడా మహిళలు శ్రద్ధ చూపాలని ఆమె సూచించారు. కుటుంబంలో మహిళ ఆరోగ్యకరమైన విధానాలు అవలంబిస్తే కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. 

More Telugu News