: రాజీనామా లేఖతో కేసీఆర్ వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే రాజాసింగ్.. లోపలికి అనుమతించని సిబ్బంది!
హైదరాబాద్లోని ధూల్ పేటలో సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర సర్కారు పూర్తిగా విఫలమైందని చెబుతూ గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్ రాజీనామా చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఇంకా స్పందన రాకపోవడంతో ఆయన తాను అన్నంత పనీ చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరకు వచ్చారు. అయితే, అధికారులు ఆయనను లోపలికి అనుమతించకపోవడంతో ఆయన గేటు వద్దే వేచి చూస్తున్నారు. ధూల్ పేట ప్రాంతంలో గుడుంబా తయారీని మానేసిన వారికి ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపించడం లేదని ఆయన అంటున్నారు.