: అంతవరకు నా పోరాటం ఆగదు: కేవీపీ

ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు డిమాండ్ చేశారు. స్పెషల్ స్టేటస్ వచ్చేంత వరకు తన పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. ప్రత్యేక హోదాకు, ప్రత్యేక ప్యాకేజీకి ముడిపెట్టి మాట్లాడటం సరికాదని అన్నారు. ప్రత్యేక హోదా వల్ల వచ్చే ప్రయోజనంతో పోల్చితే... ప్యాకేజీ వల్ల వచ్చేది సగం కూడా ఉండదని అన్నారు. ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కేవీపీ ఈ వ్యాఖ్యలు చేశారు. 

More Telugu News