: సినీ ప్రియులను లూటీ చేస్తున్న పవన్ కల్యాణ్... పోరాటానికి సిద్ధమంటున్న ఆల్ ఇండియా మూవీ గోయర్స్ అసోసియేషన్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం 'కాటమరాయుడు' కోసం సినిమా టికెట్ల ధరను పెంచడంపై ఆల్ ఇండియా మూవీ గోయర్స్ అసోసియేషన్ మండిపడింది. వంద కోట్ల రూపాయల క్లబ్ లో చేరాలన్న ఆశ, మొదటి మూడు రోజుల్లో రూ. 30 కోట్లు సంపాదించాలన్న లక్ష్యాలతో, పది రూపాయల టికెట్ ను రూ. 50 చేశారని మండిపడింది. రూ. 50 టికెట్ ను రూ. 200గా, రూ. 150 టికెట్ ను రూ. 500కు పెంచి లూటీకి పాల్పడుతున్నారని, ఈ టికెట్ల పెంపుపై కోర్టును ఆశ్రయించామని, పవన్ కల్యాణ్ ది లూటీ చేసే సిద్ధాంతమని సంఘం సభ్యులు ఆరోపించారు. ప్రభుత్వాలను బ్లాక్ మెయిల్ చేస్తూ, పవన్ తన పబ్బం గడుపుకుంటున్నారని, బెనిఫిట్ షోల పేరు చెప్పి ఒక్కో టికెట్ ను రూ. 5 వేల వరకూ అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని, దీనిపై పోరాడుతామని స్పష్టం చేశారు.

More Telugu News