: దేశ ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నా: పదవి కోల్పోయిన దక్షిణ కొరియా అధ్యక్షురాలు
భారీ మొత్తంలో లంచం తీసుకొని అక్రమాలకు పాల్పడ్డారనే కారణంతో పదవిని కోల్పోయిన దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గుయాన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ తమ దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. తనపై కొనసాగుతున్న విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని అన్నారు. ఈ రోజు ఆమె అధికారుల వద్దకు విచారణకు కదిలారు. ఈ సందర్భంగానే ఆమె తమ దేశ ప్రజలు తనని క్షమించాలని కోరారు. ప్రజాస్వామ్య బద్ధంగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టి, ఆ తర్వాత ఆమె పదవిని కోల్పోయారు. ఇలా పదవి కోల్పోయిన తొలి అధ్యక్షురాలిగా ఆమె నిలిచారు.