: సంవత్సరం తర్వాత అసెంబ్లీలో మాట్లాడిన రోజా

ఒక సంవత్సరం తర్వాత వైసీపీ ఎమ్మెల్యే రోజా ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడారు. ఏడాది పాటు ఆమెపై సస్పెన్షన్ వేటు పడటంతో ఆమె సభలోకి అడుగు పెట్టలేకపోయారు. సస్పెన్షన్ గడువు ముగియడంతో ఇప్పుడు ఆమె అమరావతిలోని కొత్త అసెంబ్లీలో జరుగుతున్న సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తన నియోజకవర్గ సమస్యలను జీరో అవర్ లో ఆమె ప్రస్తావించారు. నగరిలో నీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటుకు నిధులను మంజూరు చేయాలని కోరారు. మంత్రులు నారాయణ, బొజ్జల తన నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. 

More Telugu News