: భారత్, ఆసీస్ మూడో టెస్టు: ఆసీస్ స్కోరు 48/2

రాంచీ వేదిక‌గా భార‌త్‌, ఆస్ట్రేలియా జట్ల మ‌ధ్య‌ జరుగుతున్న మూడో టెస్టు మ్యాచులో ఫ‌లితం తేలాల్సి ఉన్న‌ చివ‌రిరోజు ఆట ప్రారంభ‌మైంది. మొద‌టి ఇన్నింగ్స్‌లో టీమిండియా 603/9గా డిక్లేర్ చేసిన విష‌యం తెలిసిందే. నిన్న రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ప్రారంభించిన‌ ఆసీస్ 23 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. ఈ రోజు ప్రారంభ‌మైన ఆట‌లో ప్ర‌స్తుతం క్రీజులో రెన్షా 14, స్మిత్ 15 ప‌రుగుల‌తో ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్ స్కోరు రెండు వికెట్ల న‌ష్టానికి 48గా ఉంది. ఆసీస్ బ్యాట్స్‌మెన్ వార్న‌ర్‌(14), లియాన్ (12)ల వికెట్ల‌ను టీమిండియా బౌల‌ర్ జడేజా తీశాడు.

More Telugu News