: జగన్ కు షాక్... వైఎస్ వివేకాపై బీటెక్ రవి విజయం!

దాదాపు అర శతాబ్దంగా వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి కంచుకోటగా నిలిచిన కడపలో తెలుగుదేశం పాగా వేసింది. కడప స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ జగన్ కు పెను షాక్ తగిలింది. ఈ ఉదయం ఎన్నికల కౌంటింగ్ జరుగగా, తెలుగుదేశం అభ్యర్థి బీటెక్ రవి, వైకాపా అభ్యర్థి వైఎస్ వివేకాపై స్వల్ప ఆధిక్యతతో విజయం సాధించారు. 33 ఓట్ల తేడాతో బీటెక్ రవి విజయం సాధించారు. ఈ ప్రాంతంలో అత్యధిక ఎంపీటీసీలు, జడ్ పీటీసీలు, ఎంపీపీలు వైకాపా టికెట్ పై గెలిచినప్పటికీ, వారంతా తెలుగుదేశంలోకి జంప్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రాస్ ఓటింగ్ జరుగుతుందని వైకాపా భావించింది. తీవ్ర ఉత్కంఠత నడుమ ఎన్నికలు జరుగగా, చివరికి అధికార పార్టీ అభ్యర్థినే విజయం వరించింది.

More Telugu News