: యోగి క్యాబినెట్ లో ముస్లింకు చోటు... 50 మందితో క్యాబినెట్

మరికాసేపట్లో యూపీకి సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న యోగి ఆదిత్యనాథ్, ఎమ్మెల్యే కాని ఓ ముస్లిం వ్యక్తికి తన మంత్రివర్గంలో స్థానం కల్పించారు. మొత్తం 50 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్న ఆయన, ఆ జాబితాను రాజ్ భవన్ వర్గాలకు అందించారు. ఆయన క్యాబినెట్ లో మొహసీన్ రాజాకు స్థానం లభించింది. కాగా, ఆదిత్య పదవీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి సుజనా చౌదరి సైతం బయలుదేరి వెళ్లారు. వీరి వెంట మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, టీడీపీ నేతలు కేశినేని నాని, కుటుంబరావు తదితరులు లక్నో వెళ్లారు.

More Telugu News