: చంద్రబాబు నీటిని తీసుకెళుతున్నా.. కేసీఆర్ మాత్రం సైలెంట్ గా ఉన్నారు: కోమటిరెడ్డి ఫైర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు గుప్పించారు. శ్రీశైలం డ్యామ్ నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమకు నీటిని తరలిస్తున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. నల్గొండ జిల్లాకు మాత్రం కేసీఆర్ సాగు నీరు ఇవ్వడం లేదని మండిపడ్డారు. శ్రీశైలం డ్యామ్ లో నీటి మట్టం డెడ్ స్టోరేజ్ కు వెళ్లినా సరే... మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు ఏప్రిల్ 15వ తేదీ వరకు నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నల్గొండలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని కోరినట్టు తెలిపారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించే బాహుబలి జానారెడ్డి కావచ్చు లేదా మరెవరైనా ఎమ్మెల్యే కావచ్చని కోమటిరెడ్డి చమత్కరించారు. జనాలందరికి బాహుబలి మానియా పట్టిందని, అందుకే జానారెడ్డి కూడా బాహుబలి గురించి మాట్లాడి ఉండవచ్చని తెలిపారు.

More Telugu News