: ఉత్తరప్రదేశ్ కు వెళుతున్న చంద్రబాబు!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరప్రదేశ్ వెళుతున్నారు. రేపు జరిగే యూపీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఆ రాష్ట్ర రాజధాని లక్నోకు వెళ్లనున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా బీజేపీ నుంచి చంద్రబాబుకు ఇప్పటికే ఆహ్వానం అందింది. రేపు మధ్యాహ్నం 12.45 గంటలకు చంద్రబాబు లక్నో చేరుకుంటారు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే.

More Telugu News