: రాజ్ నాథ్ సింగ్ వైపే మొగ్గు చూపిన మోదీ, అమిత్ షా?

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బీజేపీ అధిష్ఠానం ఎవరిని ఎంపిక చేయనుంది? అనే విషయం సర్వత్ర ఉత్కంఠను రేపుతోంది. రేసులో ముగ్గురు, నలుగురి పేర్లు వినిపించినా చివరకు రాజ్ నాథే సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు రాజ్ నాథ్ వైపే మొగ్గు చూపుతున్నారని విశ్వసనీయ సమాచారం. ఈ సాయంత్రానికి రాజ్ నాథ్ పేరును ఖరారు చేయనున్నారు. యూపీలో శాంతి భద్రతల సమస్య అధికంగా ఉండటంతో... కేంద్ర హోంమంత్రిగా ఉన్న రాజ్ నాథ్ ను సీఎంగా పంపడమే బెటర్ అని ఆరెస్సెస్ నేతలు కూడా భావిస్తున్నారు. మరోవైపు, గతంలో యూపీ సీఎంగా పనిచేసిన అనుభవం కూడా రాజ్ నాథ్ కు ఉంది.

More Telugu News