: మాలో ఒకరు బాహుబలి అవుతారు... వెన్నుపోటు పొడిచిన కట్టప్ప కేసీఆరే!: డీకే అరుణ

తెలంగాణను బాగు చేయడానికి రాజకీయాల్లోకి బాహుబలి వస్తాడంటూ కాంగ్రెస్ సీనియర్ జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. అన్ని పార్టీల రాజకీయ నేతలే కాకుండా, సామాన్య ప్రజలు సైతం ఈ బాహుబలి ఎవరా అని చర్చించుకుంటున్నారు. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ స్పందించారు. బాహుబలి కాంగ్రెస్ పార్టీ నుంచే వస్తారని... మాలో ఎవరో ఒకరు బాహుబలి అవుతారని ఆమె చెప్పారు. కట్టప్ప మాత్రం ముఖ్యమంత్రి కేసీఆరే అని ఎద్దేవా చేశారు. బాహుబలిని వెన్నుపోటు పొడిచింది కట్టప్పనే అని చెప్పారు. ఇప్పుడు నడుస్తోంది బాహుబలి-2 అని తెలిపారు. 

More Telugu News