: నార్త్ కరొలినా తెలుగు మహిళ మర్డర్ మిస్టరీని ఛేదించిన పోలీసులు... కొడుకే హంతకుడు!

అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలో హత్యకు గురైన భారతీయ తెలుగు మహిళ మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆమె కొడుకే ఆమె పాలిట యముడయ్యాడని వారు తెలిపారు. 2015లో నళిని తేలప్రోలు అనే మహిళను స్కూల్ కు వెళ్తున్న సమయంలో కారులో కొడుకే ఆమెకు ఊపిరాడకుండా చేసి చంపేశాడు. తర్వాత తన తల్లిని హత్య చేశారంటూ లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు అప్పటినుంచి ఈ కేసును విచారిస్తున్నారు. 15 నెలల తరువాత ఈ మర్డర్ మిస్టరీని ఛేదించిన పోలీసులు, హంతకుడు నళిని కుమారుడు అర్నవేనని తేల్చారు. 

More Telugu News