: తాజ్మహల్ను పేల్చేస్తామంటూ బెదిరింపులు.. భారీ బందోబస్తు
ఉత్తరప్రదేశ్, ఆగ్రాలోని తాజ్మహల్ను పేల్చేస్తామని బెదిరింపులు రావడంతో ఆ ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడకు చేరుకున్న ప్రత్యేక దళాలు తాజ్మహల్ చుట్టూ మోహరించాయి. ఈ బెదిరింపులపై ఎస్పీ ప్రీతిందర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ... తాజ్మహల్లో సాధారణంగా సీఐఎస్ఎఫ్ దళాలు పహారా కాస్తుంటాయని, వెలుపల ఉత్తరప్రదేశ్ పోలీసుల భదత్ర కూడా ఉంటుందని చెప్పారు. అక్కడ ప్రతి రోజు మాక్ డ్రిల్స్ చేస్తూనే ఉంటారని పేర్కొన్నారు. తాజ్మహల్ని చూడడానికి ప్రతి ఏడాది దాదాపు 60 లక్షల మంది పర్యాటకులు వస్తుంటారని అన్నారు.