: శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో.. హైదరాబాద్‌లో రెండు రోజులపాటు వైన్‌షాపులు బంద్

హైదరాబాద్‌లో నేటి సాయంత్రం  నుంచి రెండు రోజులపాటు వైన్‌షాపులు, బార్ అండ్ రెస్టారెంట్‌లు మూతపడనున్నాయి. శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో కమిషనరేట్ పరిధిలోని బార్లు, మద్యం షాపులను శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుంచి 19వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. వైన్ షాపు యజమానులందరూ ఈ ఆదేశాలను పాటించాలని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరించారు.

More Telugu News