: హీరో అక్షయ్ కుమార్ దేశభక్తికి సెల్యూట్ చేస్తున్నామన్న సీఆర్పీఎఫ్

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మరోమారు తన దాతృత్వం చాటుకున్నాడు. ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో ఇటీవల జరిగిన దాడిలో మృతి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు కోటి రూపాయలకు పైగా విరాళాన్ని అక్షయ్ కుమార్ ఇచ్చారు. ఈ విషయాన్ని సీఆర్పీఎఫ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. సుక్మా దాడిలో వీర మరణం పొందిన 12 మంది జవాన్ల కుటుంబాలకు విరాళంగా ఈ మొత్తాన్ని ఇచ్చారని పేర్కొంది. ఒక్కో కుటుంబానికి రూ.9 లక్షలు విరాళంగా ఇచ్చిన అక్షయ్ కుమార్, తన దేశభక్తిని చాటుకున్నారని, ఆయనకు సీఆర్పీఎఫ్ సెల్యూట్ చేస్తోందని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.

More Telugu News