: మమ్మల్ని నమ్ముకున్నవారిలో భరోసా నింపాలి: భూమా అఖిల ప్రియ, మౌనిక, జగత్ విఖ్యాత్

తన తండ్రి మరణం తరువాత చాలా బాధ్యతలు తనపై పడ్డాయని టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ తెలిపారు. ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ, తమ కుటుంబాన్ని నమ్ముకుని నంద్యాల, ఆళ్లగడ్డలో చాలా మంది ఉన్నారని చెప్పారు. వారందరికీ ఒక భరోసా కల్పించాలని ఆమె తెలిపారు. తమది ఉమ్మడి కుటుంబమని చెప్పిన ఆమె, తమ అందరికి తన తండ్రి సమాన ప్రేమను పంచారని చెప్పారు. తమ అన్న, వదినలు తమకు మద్దతుగా ఉన్నారని ఆమె తెలిపారు.

భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె మౌనిక మాట్లాడుతూ, తాను ఒక లీడర్ కుమార్తెనని అన్నారు. తన తల్లిదండ్రులను చిన్నతనం నుంచి ప్రజాసేవలో ఉండడమే చూశానని చెప్పారు. తన రక్తంలోనే రాజకీయం ఉందని ఆమె చెప్పారు. తమ కుటుంబం మొత్తం తమ వెనుకే ఉందని ఆమె అన్నారు.

జరిగిన ఘటనపై భూమా కుమారుడు జగత్ విఖ్యాత్ మాట్లాడుతూ, తను ఎంత పెద్ద చదువులు చదివినా తిరిగి రావాల్సింది ఇక్కడికేనని, అలాంటప్పుడు ఏం చేయాలా? అన్న దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అన్నాడు. కుటుంబ సభ్యులందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. ఇంతవరకు కుటుంబ సభ్యులందరం కలిసి మాట్లాడుకోలేదని, బాధ నుంచి ఇంకా తేరుకోలేదని చెప్పాడు. 

More Telugu News