: రోజాను మళ్లీ సస్పెండ్ చేస్తారా?

వైసీపీ ఎమ్మెల్యే రోజాను శాసనసభ నుంచి మళ్లీ సస్పెండ్ చేస్తారా అనే అంశం ఉత్కంఠను రేపుతోంది. రోజాపై సభా హక్కుల సంఘం సమర్పించిన నివేదికను ఈ రోజు సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ అంశంపై ఈ రోజు చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో, నివేదికను సభలో ప్రవేశపెట్టాక ఏం జరగనుంది? అనే అంశం ఆసక్తికరంగా మారింది. బడ్జెట్ కు సంబంధించి అధికార, ప్రతిపక్షాల మాటల తూటాలతో ఈనాటి సమావేశాలు వేడిగా కొనసాగుతున్నాయి. ప్రతిపక్షాన్ని కట్టడి చేసేందుకు రోజాపై సభా హక్కుల నివేదికను అధికారపక్షం వ్యూహాత్మకంగా ఈ రోజు సభలో ప్రవేశపెడుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో, రోజాను క్షమించి వదిలేస్తారా? లేక మళ్లీ సస్పెండ్ చేస్తారా? అనే విషయం ఈరోజు తేలిపోతుంది. 

More Telugu News