: ఏపీకి శుభవార్త... ప్రత్యేక ప్యాకేజీ చట్టబద్ధతకి ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ చట్టబద్ధతకు కేంద్ర కేబినెట్ అంగీకరించింది. ఈ రోజు సాయంకాలం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టుకు వందశాతం నిధులివ్వాలన్న ప్రతిపాదనకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. కాగా, ప్రత్యేక హోదాకు సమానమైన నిధులను ఈఏపీ ప్రాజెక్టుల ద్వారా సమకూర్చాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. 

More Telugu News