: టీడీపీ నేతల ముందు కమల్, ప్రకాష్ రాజ్ లు కూడా పనికిరారు: చెవిరెడ్డి భాస్కరరెడ్డి

టీడీపీ నేతలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఏ పదవి కోరుకోలేదని పేర్కొంటూ, స్క్రిప్ట్ రాయించి కొందరితో చదివించారని ఆయన ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ నేతల యాక్టింగ్ ముందు ప్రముఖ నటులు కమలహాసన్, ప్రకాష్ రాజ్ కూడా పనికి రారని ఆయన ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా తిరుపతిలో భూముల ఆక్రమణల అంశాన్ని ఆయన ప్రస్తావించారు. తిరుపతిలో భూముల ఆక్రమణల వివరాలపై కలెక్టర్, తహసీల్దార్ చెబుతున్న సమాధానాలకు ఎటువంటి పొంతన లేదన్నారు. తప్పుడు లెక్కలు చెబుతున్న కలెక్టర్ పై చర్యలు తీసుకోవాలని చెవిరెడ్డి డిమాండ్ చేశారు.  

More Telugu News