: ప్రపంచంలో ఏ ప్రాంతం కూడా పూర్తి అనుకూలంగా ఉండదు: అమరావతిపై గ్రీన్ ట్రైబ్యునల్ లో ఏపీ

నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ వాదనలు వినిపించారు. కొండవీటి వాగులో ఉన్న ఆక్రమణలను తొలగిస్తున్నామని ట్రైబ్యునల్ కు గంగూలీ తెలిపారు. ప్రపంచంలో ఏ ఒక్క ప్రాంతం కూడా వంద శాతం అనువుగా ఉండదని చెప్పారు. భూసేకరణ ద్వారా రైతుల నుంచి భూములను తీసుకుని, తిరిగి అభివృద్ధి చేసిన స్థలాలను కేటాయిస్తున్నామని తెలిపారు. ఏపీ వాదనలు విన్న ట్రైబ్యునల్ తదుపరి విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. 

More Telugu News